YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

విచ్చలవిడిగా కల్తీ మాఫియా

విచ్చలవిడిగా కల్తీ మాఫియా

విశాఖపట్టణం, జూలై 25, 
జనం ఆరోగ్యంతో కల్తీ మాఫియా ఆటలాడుకుంటోంది. కాదేదీ కల్తీకనర్హం అన్నరీతిలో జిల్లాలో పాలు.. నీరు.. మాంసం.. తినుబండారాలు.. నిత్యావసరాలు.. ఇలా అన్నింటా కల్తీ రాజ్యమేలుతోంది. ప్రజారోగ్య సంరక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా.. అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, అభిరుచులను ఆసరాగా తీసుకుని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఎక్కువగా ఆహార కల్తీకి పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చేష్టలుడిగి చూస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజారోగ్యానికి పెద్దపీట అంటున్న సర్కారు క్షేత్రస్థాయిలో మోసాలు.. లోపాలపై దృష్టి సారిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. జిల్లాలో ఆహార తనిఖీ విభాగంలో సిబ్బంది కొరత, ఇతర శాఖల అధికారుల్లో నిర్లిప్తత, ప్రజల్లో అవగాహన లోపం, ధనార్జనే ధ్యేయంగా చెలరేగుతున్న అక్రమ వ్యాపార ధోరణి.. వెరసి ప్రజారోగ్యం కల్తీకాటుకు గురవుతోంది. కాగ్‌ నిబంధనల ప్రకారం పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి 50 వేల మందికి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్షమందికి ఒక ఆహార తనిఖీ అధికారి ఉండాలి. ప్రస్తుతం.. కేవలం ముగ్గురే ఉన్నారు. వారిలోనూ ఇద్దరు జీవీఎంసీకే పరిమితమవగా, ఒక్కరే గ్రామీణ జిల్లా మొత్తం తిరగాల్సి వస్తోంది. దీంతో కల్తీ అక్రమాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఉన్నవారితోనే అంతంతమాత్రంగానే తనిఖీలు నిర్వహించి.. తూతూమంత్రంగా కేసులు నమోదు చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. కేసులు బలంగా పెట్టాల్సిన చోట కాసులకు కక్కుర్తిపడి తక్కువ మొత్తంలో జరిమానాలతో సరిపట్టేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. విశాఖ మన్యంలో వారపు సంతలే గిరిజనుల సూపర్‌ మార్కెట్లు. ఇక్కడ లభించని వస్తువంటూ ఏదీ ఉండదు. గుండు సూది నుంచి గృహోపకరణాలు, బంగారు ఆభరణాల వరకు అన్నీ లభ్యమవుతాయి. తినుబండారాలకు కొదవేలేదు. అసలు సరకును పోలిన నకిలీలతోపాటు ఆహార కల్తీలు ఇక్కడ విచ్చలవిడిగా సాగుతున్నాయి. అమాయక గిరిజనుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. నకీలీ వస్తువులకు ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లను పెట్టి గిరిజనులకు అమ్మేస్తున్నారు. ఎక్కువగా కారం, పసుపు ఇతర నిత్యావసరాలు, నూనెలో కల్తీలకు పాల్పడుతుంటారు..మన్యంలో దుకాణాలకు నకిలీ సిబ్బంది వెళ్లి వసూలు చేస్తున్నట్లు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి.ఆహార భద్రతా ప్రమాణాల సంస్థలో సిబ్బంది కొరతను ఆసరాగా చేసుకుని కొంతమంది ఈ శాఖ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఉదంతాలు ఉన్నాయి అతన్ని పరిశీలించిన వైద్యుడు ఆహారపు అలవాట్లపై ఆరా తీస్తే గత పక్షం రోజులుగా రహదారి పక్కనున్న దుకాణం వద్ద నూడిల్స్‌ క్రమం తప్పకుండా తింటున్నట్లు తెలిసింది. ఆ నొప్పికి కారణం కూడా ఆ నూడిల్సే కారణమని తేల్చారు.

Related Posts