YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చెరువులకు పటిష్ట భద్రత : మంత్రి కేటీఆర్

చెరువులకు పటిష్ట భద్రత : మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపుర్ గ్రామం లో గ్రామ చెరువులు, శుద్ధి సుందరీకరణ పనులను శంకుస్థాపన పనులు రాష్ట్ర ఐటీ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటి రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కేటీ రామారావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్ల రెడ్డి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ లు, తెరాస నాయకులు, జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హెచ్ ఎండీయే కమిషనర్ చిరంజీవులు, అధికారులు పాల్గొన్నారు. సభ లో మంత్రి  మాట్లాడుతూ చెరువుల గురించి ముఖ్య అంశాలను ప్రసంగించారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం 40 చెరువులను పూర్తీ స్థాయిగా ఆధునీకరణ, సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను నిర్వహిస్తారని, దాని కోసం  తెలంగాణ ప్రభుత్వం మొత్తం 441 కోట్ల రూపాయిలు మంజూరు చేసిందనిమంత్రి అన్నారు. 1920 లో ఏర్పడిన గండిపేట చెరువు 2020 లో తన 100 సంవత్సరాలు పూర్తీ చేసుకుంటుంది. ఈ సందర్బంగా గండిపేట చెరువు సుందరీకరణ, అభివృద్ధి కోసానికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయిలు మంజూరు చేసిందని అన్నారు. చెరువులు కబ్జాలకు గురు అవుతున్నాయి. చెరువుల భూములను కబ్జాలు చేస్తే, ఎంత పెద్ద అయినా వారందరి పై చర్యలు తీసుకుంటామని కేటీఅర్  అన్నారు. అదే విధంగా చెరువు ను రక్షణ కోసం ఓ సెక్యూరిటీ ను ఏర్పాటు చేసి, అతన్ని ఓ సైకిల్,  విజిల్  ఇస్తామని చెప్పారు. చెరువు చుట్టూ పక్కన ఒకవేళ 100 అపార్ట్మెంట్ కన్నా ఎక్కువ ఉంటె, ఆ అపార్ట్మెంట్ గాని గేటెడ్ కమ్యూనిటీ గాని, కాలనీ వాసులకు బరువు కాకుండా బిల్డర్ ల వద్ద ఎస్టీపీ  కట్టించుకోవాలని ఆదేశాలిచ్చారు. అదే విధంగా దత్తకు తీసుకున్న ప్రతి చెరువుకు దగ్గర ఉండి చూడాలని ఏమ్మెల్యే, ఎంపీ లకు కు కూడా విజ్ఞప్తి చేసారు. 

Related Posts