YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్

చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్

విశాఖపట్నం జూలై 25, 
రాజధాని అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు.పార్ట్ టైం పొలిటీషియన్గా ఉంటూ కేవలం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నా రని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు.విశాఖ గాజువాక నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు విశాఖలో రాజధానిని వ్యతిరేకించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అమరావతిపై పవన్ కల్యాణ్ ఒక్కడికే ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ, పవన్ కల్యాణ్పై సెటైర్లు వేస్తూ సినిమా తీస్తున్న నేపథ్యంలో.. ఆ బాధలో నిన్నటి వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నామని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కు రాష్ట్ర పరిస్థితు లపై అవగాహన లేదని విమర్శించా రు.మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే పవన్ వ్యతిరేకించడం ఏంటన్నారు కరణం.ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధాని వస్తే నీకేమి బాధ అని కరణం ధర్మశ్రీ, పవన్ని ప్రశ్నించా రు. మూడు రాజదానులు రావు అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పాదంగా ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు ఆయనకు తగిన బుద్ధి  చెప్పి.. ఒక్క సీటుకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ఇంతా జరిగినా ఇంకా పవన్ కల్యాణ్లో మార్పు రాకపోవడం దురదృష్టకరం అన్నారు. పవన్ది జనసేన కాదు.. కళసేన అని తీవ్ర విమర్శలు చేసిన ఆయన మూడు రాజధానులు రావడం ఖాయమన్నారు. ఒక విధానం అంటూ లేకుండా ఆరునెలలుకు ఒకసారి బయటకు వచ్చి తప్పుడు ప్రచారాలు చేసి కనుమరుగవ్వడం పవన్ కల్యాణ్కు అలవాటన్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలు పవన్ కల్యాణ్కు తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు.

Related Posts