YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అభివృద్ధి కే అధిక ప్రాధాన్యత - ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

అభివృద్ధి కే అధిక ప్రాధాన్యత - ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

శంషాబాద్ జులై 25 
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక  అన్ని రంగాల్లో రాష్ట్రం ఏంతో పురోగతి సాధిస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ చిన్నగోల్కొండ ప్రభుత్వ పాఠశాలకు 2లక్షలతో నిర్మించ తలపెట్టిన ప్రహరిగొడ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.తన నియోజకవర్గంలో విద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తామని చదువు విలువ తనకు తెలుసు కాబట్టే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ఐటీశాఖ మంత్రి జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు .నేతల సమక్షంలో ఎమ్మెల్యే కేక్ కటచేశారు.
పల్లె ప్రకృతి వనం....చిన్నగోల్కొండ గ్రామంలో పల్లె ప్రకృతి వనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్లెలు పచ్చదనం పరుచుకోవాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.ఇప్పుడు మనం మొక్కలు నాటితే భావితరాలకు అవే మంచి ప్రకృతిని అందించి సకాలంలో వర్షాలు కురిసి. మానవ మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి అందిస్తాయని తెలిపారు ఈకార్యక్రమంలోటిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

Related Posts