YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఏసీబీ అదుపులో మాజీ తహశీల్దార్ హసీనా

ఏసీబీ అదుపులో మాజీ తహశీల్దార్ హసీనా

నెల్లూరు జులై 25 
గూడూరు తహశీల్దార్ గా పనిచేసిన షేక్ హసీనా ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. గత ఏడాది నవంబర్ 7న  సినీ ఫక్కీలో హసీనాను ట్రాప్ చేసారు. నాలుగు  లక్షలు లంచం తీసుకుంటూ గూడూరు తహశీల్ధార్ హసీనబీ పరిచయస్థుడు మహబూబ్ ఆలి ఏసీబీ కి పట్టుబడ్డాడు.  అప్పటి నుంచి న్న తసీల్ధార్ హసీనా పరారీలో వుంది.  ఆన్ లైన్ లో భూమి క్లియర్ చేసేందుకు సురేష్ అనే వ్యక్తిని 8 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు ఏసీబీ అందింది. ముందుగా 4 లక్షలు  ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఆ నగదు పాణ్యం బస్ స్టాండ్ లో మహబూబ్ అనే వ్యక్తికి ఇవ్వాలని హసీనా చెప్పింది. ఫోన్ లో మహబూబ్ ,సురేష్ తో మాట్లాడి డబ్బులు ఇప్పించింది.  ఏసీబీ అధికారుల ట్రాప్ నుంచి తప్పించుకున్న హసీనా దాదాపు ఏడు నెలలు వారికి దొరకకుండా ముప్పు తిప్పలు పెట్టింది.

Related Posts