న్యూఢిల్లీ, జూలై 27,
ఫ్రాన్స్లోని మెరిగ్నక్ నుంచి సోమవారం కనీసం ఐదు రాఫెల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు బయలుదేరాయి. ఇవి బుధవారానికి ఇండియా చేరుకోవచ్చునని తెలిసింది. ఒకవేళ అవసరమైతే వారంలోనే ఈ ఎయిర్క్రాఫ్ట్లు ఆపరేషన్స్కు సిద్ధమవుతాయని సమాచారం. తూర్పు లడఖ్లో ఇండియా–చైనా మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న నేపథ్యంలో అవసరమైతే వెంటనే కదనరంగంలో దూకడానికి వీటిని రెడీగా ఉంచుతారని తెలుస్తోంది.డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం 12 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) పైలట్లు రాఫెల్ జెట్స్ను నడపడానికి పూర్తిగా శిక్షితులయ్యారని తెలిసింది. అద్భుతమైన ఫైర్ పవర్ కలిగిన ఈ ఎయిర్క్రాఫ్ట్లను మన రీజియన్లో గేమ్ చేంజర్గా అంచనా వేస్తున్నారు. ‘కచ్చితంగా ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు టేకాఫ్ అవుతాయనేది సోమవారం మాత్రమే తెలుస్తుంది. ఈ నెల 29న ఐదు ఎయిర్క్రాఫ్ట్లు ఇండియాలో ల్యాండ్ అవుతాయని ఐఏఎఫ్ తెలిపింది. కానీ ఆ సంఖ్య ఆరు కూడా అయ్యుండొచ్చు’ అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.