YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు

మంత్రి ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు

చొప్పదండి జూలై 27 
జగిత్యాల జిల్లా గంగాధర మండల కేంద్రంలోని క్రాస్ రోడ్డు వద్ద గల ప్రధాన రహదారిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ దిష్టి బొమ్మ ను చొప్ప దండి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టీ పి సి సి అధికార ప్రతినిధి డా మేడిపల్లి సత్యం ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం దహనం చేసారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన గుర్రం అంజ గౌడ్ కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా ఆదివారం కరీంనగర్ సివిల్ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక బెడ్ పై నుండి కింద పడి చనిపోవడం జరిగిందని అందుకు నిరసనగా  గంగాధర క్రాస్ రోడ్ వద్ద రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల
రాజేందర్ గారి దిష్టి బొమ్మ దగ్దం చేయడం జరిగిందని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కరీంనగర్ సివిల్ హాస్పిటల్ హాస్పిటల్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. చనిపోయిన గుర్రం అంజగౌడ్ కుటుంబ సబ్యులకు 10లక్షల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, ఎంపిటీసి దుబ్బాసి బుచ్చయ్య పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts