YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తండ్రి చేతిలో తనయుడు హతం...

తండ్రి చేతిలో తనయుడు హతం...

భద్రాద్రి కొత్తగూడెం జూలై 28, 
మద్యం మత్తు కొన్ని జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి. తాజాగా ఒక తండ్రి మద్యం మత్తు లో కన్న కొడుకునే కడతేర్చిన ఉదంతం మొండికుంట లో చోటు చేసుకుంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం లో మద్యం ఓ కుటుంబం లో చిచ్చురేపింది . మద్యానికి బానిసలైన తండ్రి,కొడుకులు తరచు గోడవ పడుతుండేవారు. ఈ నేపథ్యం లో  మద్యానికి బానిసైన సామ సంజీవ రెడ్డి (33) మద్యానికి బానిసై మద్యం మత్తులో ఇంట్లో అందరిని ఇబ్బoధులకు గురిచేస్తుండే వాడు. అతని నడవడిక నచ్చని అతని భార్య సైతం 3 సంవత్సరాల క్రితం తమ కొడుకు తోపాటు అతనిని వదిలేసి వెళ్ళిపోయింది. నిన్న రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన సంజీవ్ రెడ్డికి తండ్రి రమిరెడ్డికి మద్యన గొడవ చెలరేగింది. ఈ నేపధ్యంలో తీవ్రమనోవేదనకు గురైన తండ్రి రామిరెడ్డి కొడుకు నిద్రలో ఉన్న సమయంలో గొడ్డలితో నరికి హత్య చేసి పరారయ్యాడు. మృతుని తల్లి లక్ష్మమ్మ  పిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అశ్వాపురం సి ఐ  సట్ల రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Related Posts