YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన గుత్తా

జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన గుత్తా

హైదరాబాద్ జూలై 28 
మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి  ప్రథమ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని జైపాల్ రెడ్డి  ఘాట్ వద్ద శాసన మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి  కుటుంబ సమేతంగా  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డిని స్మరించుకుంటు మీడియాతో మాట్లాడారు. జైపాల్ రెడ్డి  రాష్ట్ర ,కేంద్ర మంత్రులుగా పని చేసి ప్రజలకు ఎనలేని సేవ చేశారు . నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిగా జైపాల్ రెడ్డి  గొప్ప పేరునుసంపాదించుకున్నారు . జైపాల్ రెడ్డి బహు బాషాకోవిదుడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే వారు. అయన నేటి తరానికి ఆదర్శనీయులు, అయన జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శం తీసుకోవాలని అన్నారు.
జైపాల్ రెడ్డి  బెస్ట్ పార్లమెంటేరిన్ అవార్డ్ గెలుపొందారు. కేంద్ర మంత్రి హోదాలో  ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో జైపాల్ రెడ్డి  చురుకైన పాత్రను పోషించారు. జైపాల్ రెడ్డి ని గౌరవిస్తూ  నెక్లెస్ రోడ్ లో  ఘాట్ ని నిర్మించడానికి అర ఎకరం స్థలం  కేటాయించిన ముఖ్యమంత్రి  కేసీఆర్,  మున్సిపల్ శాఖ  మంత్రి కేటీఆర్ కు  ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు

Related Posts