YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మరో మలుపు తిరుగుతున్న రాజధాని కేసు

మరో మలుపు తిరుగుతున్న రాజధాని కేసు

గుంటూరు, జూలై 29, 
విశాఖపట్నంకు పరిపాలనా రాజధాని తరలింపు వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. మూడు రాజధానులు, విశాఖకు రాజధాని తరలింపు అంశాలపై కోర్టులో విచారణ జరుగుతుండగా, మంగళవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇంప్లీడ్‌ పిటిషన్‌ను వేశారు. రాష్ట్ర రాజధాని అనేది భూములిచ్చిన రైతులు సొంత వ్యవహారం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి హక్కని పిటిషన్‌లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కాని రైతులు కాదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూ కేటాయింపులు జరిగాయని, అప్పుడు స్పందించని ఈ సమితి ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డు పడుతుందని పేర్కొన్నారు.రాజధాని అమరావతిలో 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం పూర్తిగా అవాస్తవమని పిటిషన్‌లో వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. కొందరి రాజకీయ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడడం కోసమే హైకోర్టులో పిటిషన్ వేశారని ఆరోపించారు. ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనాలు లేవని, అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. రాజధాని తరలింపునకు అయ్యే ఖర్చు రూ. 70 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. రాజధాని తరలింపును ఏ ఉద్యోగ సంఘం వ్యతిరేకించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Related Posts