భారత రాజ్యంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేడ్కర్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ర్ అన్నారు. భారతీయ సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని, భవిష్యత్ మార్గనిర్దేశనం చేసిన వ్యక్తి అని అయన కొనియాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సిఎం ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రపంచంలోని మిగతా దేశాలకు, భారతదేశానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి, భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారన్నారు. ఆయన దూరదృష్టి, కాల్పనికత వల్లే ఇవాళ దేశం సామజిక న్యాయం దిశగా ముందడుగు వేస్తున్నదని ముఖ్యమంత్రి అన్నారు.