YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కరోనా రోగిపై నగలు మాయం

కరోనా రోగిపై నగలు మాయం

హైద్రాబాద్, ఆగస్టు 3, 
కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయిన మహిళ ఒంటిపై నగలు కాజేసి ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన బాధిత కుటుంబం బంజారాహిల్స్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. కరోనా చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం ఓ మహిళ చేరింది. ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే మృతదేహంపై నుండి బంగారు ఆభరణాలు మాయమైనట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.మృతురాలి శరీరంపై ఉన్న బంగారు గొలుసు, గాజులు, వజ్రాల చెవి పోగులు మాయం అయినట్లు బంధువులు ఆరోపించారు. వజ్రపు ముక్కుపుడక కూడా పోయిందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Related Posts