న్యూ ఢిల్లీ ఆగష్టు 3
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం రక్షా బంధన్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన పండుగల్లో రక్షాబంధన్ ఒకటి. అన్నాచెల్లెళ్ల అనుంబంధానిక ప్రతీక ఈ రాఖీ పండుగ. ఈ సందర్భంగా "రక్షా బంధన్ పండుగ సందర్భంగా పౌరులందరికీ శుభాకాంక్షలు" అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.‘‘ఈ పండుగ సోదరులు, సోదరీమణులను కట్టిపడేసే ప్రేమ మరియు ఆప్యాయత యొక్క బలమైన సంబంధాలను పునరుద్ఘాటిస్తుంద’’ని వెంకయ్యనాయుడు అన్నారు.