YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అత్యాచార నిందితులపై దిశా చట్టం కేసు నమోదు చేయ్యాలి

అత్యాచార నిందితులపై దిశా చట్టం కేసు నమోదు చేయ్యాలి

కర్నూలు ఆగస్టు 4,
వెలుగోడు గ్రామంలో జమ్మినగర్ కు చెందిన తాండా మహిళ పై నలుగురు వ్యక్తులు భర్తను కొట్టి భర్త ఎదుటే అతి దారుణంగా అత్యాచారం చేసిన నిందితులపై దిశా పోక్సా చట్టాలను నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బహుజన సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంజుల సుబ్బరాయుడు సిపిఐ(యంయల్)రెడ్ స్టార్ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ లు ఆత్మకూరు డియస్ పి గారికి వెలుగోడు పోలీసు స్టేషన్ లో వినతిపత్రం అందజేశారు అనంతరం పై నాయకులు మాట్లాడుతూరాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు నిదింతులపై కఠిన శిక్షలు ఖరారు కాకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి కోర్టులో ఇలాంటి నిందితుల పట్ల ఏ న్యాయవాది కూడా కేసును వాదించకుండా ఉండాలని పై నాయకులు న్యాయవాదులకు విజ్ఞప్తి చేసారు మహిళలపై దాడులు చేయ్యాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా శిక్షలు వేయ్యాలని వారు కోరారు

Related Posts