YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

రెండు రోజుల్లో రెండు ఆస్పత్రుల సీజ్

రెండు రోజుల్లో రెండు ఆస్పత్రుల సీజ్

రెండు రోజుల్లో రెండు ఆస్పత్రుల సీజ్
హైద్రాబాద్, 
కరోనా మహమ్మారిని క్యాష్ చేసుకొనేందుకు హైదరాబాద్‌లోని పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా చికిత్సకు రూ.లక్షల్లో బిల్లు వేసి పేషంట్లను పీడించుకు తింటున్న ఘటనలు అనేకం వెలుగు చూశాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి సోమవారం సోమాజీగూడకు చెందిన ఓ బడా ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకుంది. అందులో కొవిడ్ చికిత్స చేయకుండా అనుమతులు రద్దు చేసింది. తాజాగా మాట వినని మరో ఆస్పత్రిపై సర్కారు కొరడా ఝుళిపించింది.మంగళవారం బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిపైనా తెలంగాణ ఆరోగ్యశాఖ వేటు వేసింది. మంగళవారం రాత్రి నుంచి ఆ ఆస్పత్రిలో కరోనా వైద్యం చేయకూడదని ఉత్వర్వులు జారీ చేసింది. ఈ ఆస్పత్రిపై గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున రోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం తాజా కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు కరోనా రోగుల నుంచి రోజుకు లక్ష రూపాయిలు చొప్పున వసూలు చేసినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. దీంతో కొత్తగా కొవిడ్ రోగులను చేర్చుకోవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న రోగులకు యథాతథంగా చికిత్స అందించాలని సూచించారు.కరోనా రోగుల చికిత్సకు ఆయా వార్డును బట్టి ఛార్జీలు ఎంత వసూలు చేయాలనే అంశంపై ప్రభుత్వం చాలా రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. వెంటిలేటర్‌పై ఉన్నా రోజుకు రూ.10 వేలకు మించి తీసుకోకూడదని నిబంధనలు ఉన్నాయి. అయితే, తాజాగా వేటు వేసిన ఆస్పత్రిలో మాత్రం రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో కరోనా చికిత్సను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది

Related Posts