YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

సివిల్స్ లో తెలుగు వెలుగులు

సివిల్స్ లో తెలుగు వెలుగులు

సివిల్స్ లో తెలుగు వెలుగులు
హైద్రాబాద్, 
సివిల్స్-2019 ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్‌కు చెందిన సందీప్ వ‌ర్మ సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్షలో 244వ ర్యాంక్ సాధించారు. అయితే ఇతను 2016లో 732వ ర్యాంక్‌తో ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపిక‌య్యారు. మళ్లీ ఐఆర్ఎస్‌కు సెలవు పెట్టి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకు సాధించారు. పినాన్ని కోటేశ్వర‌రావు, ప్రభావ‌తిల రెండో కుమారుడు ఈయన. ఇతని తండ్రి కోటేశ్వరరావు విద్యుత్ శాఖలో జూనియ‌ర్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌గా(జేఏఓ)గా పని చేస్తున్నారు. తల్లి అదే శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని ఉన్నారు.2019 సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో ఆలిండియా 93వ ర్యాంకు సాధించి కరీంనగర్‌కు చెందిన ఐశ్వర్య పలువురికి ఆదర్శంగా నిలిచారు. కరీంనగర్ ఎన్‌సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ కుమార్తె ఐశ్వర్య. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 93వ ర్యాంకు సాధించడం పట్ల ఆమె తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఏ అంశంలోనూ ఐశ్వర్య కోచింగ్‌ తీసుకోలేదని, ఆమె యువతకు ఆదర్శంగా నిలిచిందనిఅన్నారు. చిన్న వయసులోనే సివిల్స్‌ సాధించిన వారి జాబితాలో ఐశర్య ఒకరని చెప్పారు.సిద్ధిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా స్థాయిలో 110వ ర్యాంకు సాధించాడు. మొత్తం 829 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కాగా, మకరంద్ మంచి ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అతని ప్రతిభపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆనందం వ్యక్తం చేశారు. సివిల్స్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించిన సిద్దిపేట బిడ్డ మంద మకరంద్‌కు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ హరీష్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని మకరంద్ దేశ స్థాయిలో నిలిపారంటూ మకరంద్‌ను అభినందించారు. మకరంద్ స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా రావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామం. మకరంద్ తల్లిదండ్రులు నిర్మల, సురేశ్ నాలుగు దశాబ్దాల కిందట సిద్దిపేటలో స్థిరపడ్డారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని గుండ్ల భావి గ్రామానికి చెందిన దాత్రి రెడ్డి ఐఏఎస్ ఫలితాల్లో 46వ ర్యాంకు సాధించింది. గతంలో ఈమె గతంలో 283వ ర్యాంకు సాధించి, ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఉన్నారు.చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన బడేటి సత్య ప్రకాష్ గౌడ్ యూపీఎస్సీ ఫలితాల్లో 218వ ర్యాంక్ సాధించాడు. బడేటి అశోక్, వసంత దంపతుల కుమారుడు ఈయన. నల్గొండ, హైదరాబాద్‌లలో ప్రాథమిక విద్యను, ఐఐటీ పట్నాలో బీ.టెక్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి సివిల్ పరీక్షలకు ఇంట్లో ఉండి సన్నద్ధమయ్యాడు. సివిల్స్‌లో మొదటి సారే 218 రాంక్ దక్కించుకున్నారు.
ఈ మేరకు 829 మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304 జనరల్‌, 78 ఈబీసీ, 254 ఓబీసీ, 129 ఎస్సీ , 67 ఎస్టీ కేటగిరీకి చెందిన వారు ఉన్నారు.
యూపీఎస్సీ సివిల్స్-2019లో మెరుగైన ర్యాంకులు సాధించిన ఏపీ, తెలంగాణకు చెందిన తెలుగు తేజాలు
* పి.ధాత్రి రెడ్డి-46వ ర్యాంకు
* మల్లవరపు సూర్యతేజ-76
* కట్టా రవితేజ- 77
* ఎంవీ సత్యసాయి కార్తీక్-103
* మంద మకరంద్- 110
* తాటిమాకుల రాహుల్ రెడ్డి-117
* కె.ప్రేమ్ సాగర్-170
* శ్రీచైతన్య కుమార్ రెడ్డి-250
* చీమల శివగోపాల్ రెడ్డి-263
* యలవర్తి మోహన్ కృష్ణ-283
* ఎ.వెంకటేశ్వర్ రెడ్డి- 314
* ముత్తినేని సాయితేజ- 344
* ముక్కెర లక్ష్మీపావన గాయత్రి- 427
* కొల్లాబత్తుల కార్తీక్-428
* ఎన్.వివేక్ రెడ్డి-485
* నీతిపూడి రష్మితారావు- 534
* కోరుకొండ సిద్ధార్థ-566
* సి.సమీర్ రాజా-603
* కొప్పిశెట్టి కిరణ్మయి-633

Related Posts