YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జన్మభూమికి చేరిన శ్రీరాముని విగ్రహం...

జన్మభూమికి చేరిన శ్రీరాముని విగ్రహం...

లక్నో ఆగష్టు 5
100 కోట్ల మందికి పైగా హిందువులు ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. అయోధ్యలో అత్యంత వైభవంగా రామాలయం నిర్మాణానికి పూజలు మొదలయ్యాయి. ఈ మధ్యాహ్నం ఆలయ శంకుస్థాపన జరుగనుండగా, శ్రీరాముని విగ్రహం ఎన్నో ఏళ్ల తరువాత జన్మభూమిగా భావిస్తున్న ప్రాంతానికి చేర్చారు. ఇందుకు సంబంధించిన తొలి వీడియో వైరల్ అవుతోంది. శ్రీరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నేటి మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన జరుగనుండగా, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

Related Posts