YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానులు చట్టం కోర్టులో నిలబడదా? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానులు చట్టం కోర్టులో నిలబడదా?  సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సంచలన వ్యాఖ్యలు

అమరావతి  ఆగష్టు 5
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బాగా హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది రాజధాని మార్పే.‌అయితే అమరావతి రాజధాని అన్నది ముగిసిన అధ్యాయం కాదని, న్యాయవ్వస్థ పరిధిలోకి వెళితే జగన్ తీసుకున్న నిర్ణయం, చేసిన చట్టం కోర్టులో నిలబడవని, వైఎస్ఆర్ సీపీ చేసిన చట్టంలో పలు లోపాలు ఉండడమే దీనికి కారణం అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ ఒక ఛానల్ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. వికేంద్రీకరణ మంచిది అని కొన్ని జిల్లాల వారు అంటుంటే, అమరావతి రాజధానిగా కొనసాగించటం మంచిదని మరి కొన్ని జిల్లాల వారు అంటున్నారు. రాజధాని ని మార్చడం అన్నది జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అని కొందరు అంటుంటే, చంద్రబాబు తన పాలించిన ఐదేళ్లలో అమరావతి ని రాజధానిగా కేంద్ర గెజిట్ లో పొందుపరచి ఉంటే ఇప్పుడు ఈ నిర్ణయం జగన్ తీసుకునే ఉండేవారు కాదని, ఒకరకంగా చంద్రబాబు అప్పుడు చేసిన పొరపాట్లు అమరావతి రైతులకు శాపంగా మారాయని మరికొందరు అంటున్నారు. అయితే ప్రజల చర్చ ఇలా ఉంటే న్యాయకోవిదుల చర్చ మరొకలా ఉంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల గౌడ ఒక ఛానల్ డిబేట్ లో తన అభిప్రాయాలను వెల్లడించారు. మూడు రాజధానులు బిల్లు ఆమోదం , సీీఆర్డీఏ రద్దు బిల్లు రాజ్యాంగం ప్రకారం చెల్లవని, ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం విభజించినప్పుడు చేసిన ఆంధ్ర్ర్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో _*“క్యాపిటల్”*_ అని మాత్రమే ఉందని, క్యాపిటల్స్ అని కాదని, రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టం కేంద్ర ప్రభుత్వం చేసిన పునర్విభజన చట్టానికి లోబడి ఉండాలని ఆయన అన్నారు. దేవిధంగా, అసెంబ్లీ పెట్టినంతమాత్రాన లెజిస్లేటివ్ రాజధాని అంటే అయిపోదు అని, హై కోర్టు వేరే చోటకి తరలించి, అది న్యాయ రాజధాని అంటే అది కుదరదని ఆయన వ్యాఖ్యానించారు. హై కోర్టు పెట్టే అధికారం రాష్ట్ర పరిధిలో ఉండదని, అది కేవలం ప్రెసిడెంట్ అఫ్ ఇండియా కే ఉంటుంది అని వ్యాఖ్యానించిన ఆయన, వీటన్నింటిని బట్టి పరిశీలిస్తే రాజ్యాంగ బద్దంగా మూడు రాజధానులు అన్నది కోర్టులో నిలబడక పోవచ్చునని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఆర్ధిక బిల్లులు కానివి ఏవైనా అసెంబ్లీ లో పాసై, మండలిలో తిరస్కరణకు గురైతే సవరణలతో మళ్ళీ పంపాలని, ఒకవేళ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి నిర్ణయిస్తే అలా చేయకుండా శాసనమండలిని కాదని, రెండోసారి అసెంబ్లీ లో పెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన విశ్లేషించారు. మొత్తానికి ఈ రెండు బిల్లులు రాజ్యాంగ బద్దంగా లేవు అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ముక్తాయించారు. ఏది ఏమైనా అమరావతి రాజధాని అన్నది ముగిసిన అధ్యాయం కాదని, న్యాయ పరమైన అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్న నేపథ్యంలో _*”పిక్చర్ అభీ బాకీ హై దోస్త్”*_ అన్నట్లుగా మున్ముందు పరిస్థితులు ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్ లో ఏకంగాాా రాజకీయ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేే స్థాయి నాయకులే కోర్టుల ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, జడ్జీలను అవమానిస్తూ మాట్లాడడం వంటిి వాటిపై ఇటీవలే సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిిన సంగతి తెలిసిందే. మరిిిి ఈ నేపథ్యంలో మూడు రాజధానుల భవిష్యత్తు ఏమతుంది అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

Related Posts