YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం… ఇద్దరు తమిళ స్మగ్లర్లు అరెస్ట్

23 ఎర్రచందనం  దుంగలు  స్వాధీనం… ఇద్దరు తమిళ స్మగ్లర్లు అరెస్ట్

చిత్తూరు జిల్లా   భాకరాపేట లో అధికారులు ఇద్దరు తమిళ స్మగర్లర్లను ఆరెస్టు చేసారు. వారినుంచి 23 చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అడవి క్షేత్ర అధికారి పట్టాభిరాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి ఆదివారం రాత్రి భాకరాపేట రేంజ్ ఆఫీసర్కు అందిన రహస్య సమాచారం మేరకు వారు సిబ్బంది,  స్ట్రైక్ ఫోర్స్  తో కలిసి తలకోన సెంట్రల్ బీటు ఊట్ల దింప దాడి  ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా సుమారు 25 మంది తమిళ స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలు మూసుకొని వస్తున్నారని మా సిబ్బంది ని చూసి వారు దుంగలు కింద పడవేసి పారిపోవుట కు ప్రయత్నించగా మా సిబ్బంది వారిలో ఇద్దరిని పట్టుకున్నారు మిగిలిన వారు పారిపోయారు పట్టుబడ్డ వారు తమిళనాడు తిరువన్నమలై జిల్లాకు చెందిన సి గోవిందస్వామి జి మూర్తి అని తెలిపారు పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి అని తెలిపారు పట్టుబడిన 23దుంగలు బరువు ఆరు వందల ఎనభై రెండు కేజీలు ఉన్నదని ఈ  దుంగలు  విలువ నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. ఈ దాడిలో రేంజ్ ఆఫీసర్ ఎం పట్టాభి తమ సిబ్బందితో పాల్గొన్నారు

Related Posts