హైదరాబాద్, ఆగష్టు 7
ప్రీమియం బీజెల్ లెస్ స్మార్ట్ టీవీలను ఓత్ ప్రో సిరీస్లో భాగంగా గత నెల విజయవంతంగా ఆవిష్కరించిన అనంతరం, యూరోపిన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ థాంప్సన్ ఇప్పుడు పాత్ సిరీస్ను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధరలు 10,999 రూపాయలు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాలను తీర్చే రీతిలో పాత్ సిరీస్ ను డిజైన్ చేశారు. గుగూల్ అసిస్టెంట్ మద్దతు కలిగిన పాత్ సిరీస్, సాటిలేని అనుభవాలను ధరల పట్ల అత్యంత ఆప్రమప్తంగా ఉండే ఆన్లైన్ షాపర్లకు అందిస్తుంది.ఈ ఆవిష్కరణ గురించి అవ్నీత్ సింగ్ మార్వా, సీఈవొ, సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్పీపీఎల్) అండ్ ఇండియా బ్రాండ్ లైసెన్సీ, థాంప్సన్ టీవీ మాట్లాడుతూ "రాబోయే ఐదేళ్లలో ఆండ్రాయిడ్ టీవీ తయారీని గరిష్టం చేయాలన్నది లక్ష్యం. గుగూల్తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల గర్వంగా ఉన్నాం. పాత్ 9ఏ, 9ఆర్ సిరీస్ను పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసి తయారుచేశాం. వోకల్ ఫర్ లోకల్ ఆండ్రాయిడ్ టీవీలకు ఇది ఆరంభం. ఈ టీవీల ఆవిష్కరణతో 2021-22 సంవత్సరాంతానికి 7% మార్కెట్ వాటాను పొందగలమని ఆశిస్తున్నాము'' అని అన్నారు. ఈ సిరీస్ టీవీలు ఆగస్టు 6వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్పై ప్రత్యేకంగా లభించనున్నాయి.