YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వరుస భేటీలతో బిజీబిజీగా...

వరుస భేటీలతో బిజీబిజీగా...

హైదరాబాద్ ఆగష్టు 7
ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. నిన్న మెగాస్టార్ చిరంజీవిని  కలిసిన ఆయన.. ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. వీరి భేటీ మర్యాద పూర్వకంగా జరిగిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ఏపీ అధ్యక్షులుగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన అనంతరం వీరిద్దరూ సమావేశం కావడం ఇదే మొదటిసారి. ట్విట్టర్ వేదికగా పవన్ శుభాకాంక్షలు చెప్పినా.. ఇరువురు భేటీ కాలేదు. అయితే గురువారం చిరును కలిసిన సోము.. ఇవాళ పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీర్రాజుకు పుష్ప గుచ్ఛం అందించి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి.
చిరు ఇంటికి వెళ్లిన సోము.. కాసేపు మాట్లాడారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన సోమును మెగాస్టార్ అభినందించారు. ఈ సందర్భంగా పుష్పమాల, శాలువాతో వీర్రాజును చిరంజీవి సత్కరించారు. అనంతరం పలు విషయాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సోము వీర్రాజుకు చిరంజీవి సూచించినట్టుగా వీర్రాజు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Related Posts