YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పెన్మత్స మృతి తీరని లోటు

పెన్మత్స మృతి తీరని లోటు

విజయవాడ ఆగస్టు 10, 
వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పెన్మత్ససాంబశివరాజు మరణం అత్యంత బాధాకరమని ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. రాజకీయాలలో కురు వృద్ధులు. రెండు సార్లు మంత్రి గా,  ఎనిమిదిసార్లు శాసనసభ్యులు గా ఎన్నికై విజయనగరం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించిన సాంబశివరాజు మరణం ఉత్తరాంధ్ర కే కాకుండా వైస్సార్సీపీ తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్ధిస్తున్నట్టు మంత్రి ఆళ్ల నాని సంతాప సందేశంలో తెలియ జేశారు.
వైస్సార్సీపీ లో క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలు ఎంతో చిత్త శుద్ధితో నిర్వహించి...ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడంలో సాంబశివరాజు చేసిన కృషి మరువలేనిదని ...ఈ ఆపత్కాలంలో వారి కుటుంబానికి భగవంతుడు మనో దైర్యం కలిగించాలని ప్రార్ధిస్తున్నట్టు మంత్రి చెప్పారు...

Related Posts