YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సచిన్ పైలెట్ తో కాంగ్రెస్ చర్చలు

సచిన్ పైలెట్ తో కాంగ్రెస్  చర్చలు

జైపూర్, ఆగస్టు 10
తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అగ్ర నాయకులను కలవనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు నెల రోజులుగా రాజస్థాన్ ‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగా.. ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలను కవలనున్నారనే ప్రచారానికి ప్రాధాన్యత ఏర్పడింది.సచిన్ పైలట్, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు లేదా ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ వాద్రా, సచిన్ పైలట్ మధ్య రెండు వారాల కిందట ఢిల్లీలోని ఒక సాధారణ ప్రదేశంలో జరిగిన భేటీకి ఇది కొనసాగింపని, వివిధ స్థాయిలలో చర్చలు జరిగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పైలట్ వర్గం మాత్రం దీనిని కొట్టిపారేస్తోంది. అలాంటి చర్చలు ఏవీ జరగలేదని, ముఖ్యమంత్రిని తొలగించాలనేది తమ డిమాండ్ అని పేర్కొన్నాయి.మరోవైపు, నాలుగు రోజుల్లో అసెంబ్లీ సమావేశం కానుండగా.. మెజార్టీని నిరూపించుకుని సచిన్‌కు షాక్ ఇవ్వాలని గెహ్లాట్ పావులు కదుపుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ విముఖత వ్యక్తం చేయడంతో.. ఏదైనా బిల్లును తీసుకొచ్చి, విప్ జారీచేసి ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చడానికి సచిన్ ప్రయత్నించారని గెహ్లాట్ పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీటిని సచిన్ పైలట్ కొట్టిపారేశారు. అంతేకాదు, బీజేపీ చేరుతానని జరిగిన ప్రచారాన్ని కూడా ఖండించిన ఆయన.. కేవలం అశోక్ గెహ్లాట్‌ వైఖరిపై తప్ప తాను పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.రాజస్థాన్‌లో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇరు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాల్లో భాగంగా.. రెబల్ ఎమ్మెల్యేతో సమావేశమైనట్టు తెలుస్తోంది. మరోవైపు, జైసల్మేర్‌లోని బసచేసిన ఎమ్మెల్యేతో ఆదివారం రాత్రి సీఎల్పీ సమావేశం జరిగింది. రెబల్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తిరిగి రానివ్వబోమని గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు.అయితే, అగ్రనాయకత్వం నుంచి ఆదేశాలు లేకుండా అలాంటి చర్యలు తీసుకోబోమని రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ అవినాష్ పాండే అన్నారు. అసెంబ్లీలో పార్టీ ఐక్యతను ప్రదర్శించాలని ఎమ్మెల్యేలకు గెహ్లాట్ ఉద్బోద చేశారు. మనమంతా ప్రజాస్వామ్య యోధులం.. ఈ యుద్ధంలో గెలవాలి.. మరో మూడున్నరేళ్ల తర్వాత కూడా గెలుపు మనదే కావాలని అన్నారు.

Related Posts