YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కుంభకర్ణుడు

కేసీఆర్ కుంభకర్ణుడు

హైద్రాబాద్, ఆగస్టు 10
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనాను కట్టడి చేయకుండా కుంభకర్ణుడిలా మొద్దు నిద్ర పోతున్నారని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ జిల్లాల్లో బీజేపీ ఆఫీసులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ఆయన.. తెలంగాణ సర్కారును టార్గెట్ చేసుకొని విమర్శలకు దిగారు.రూ.45 వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును దోచుకోవడం కోసమే రూ.85 వేల కోట్లకు పెంచారని నడ్డా ఆరోపించారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయన్న కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని మాటిచ్చి.. 50 వేల ఇండ్లు కూడా కట్టలేదన్నారు. గత ఆరేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నడ్డా డిమాండ్ చేశారు.కరోనాను కట్టడి చేయకుండా కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని నడ్డా విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా కేసీఆర్ సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం లేదని.. దీంతో 98 లక్షల మంది బీమా సదుపాయాన్ని కోల్పోయారన్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని నడ్డా కోరారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రజలు కేంద్రానికి సహకరించాలని కోరారు. కరోనాను ఎదుర్కోవడంలో మోదీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు

Related Posts