YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అచ్చం...అమ్మలాగే...

అచ్చం...అమ్మలాగే...

బెంగళూర్, ఆగస్టు 11, 
ర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల నిర్వహించిన గృహ ప్రవేశం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక ఫోటో ఇది. నూతన గృహ ప్రవేశం సందర్భంగా ఆ ఇంటి యజమాని తన కుటుంబంతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చిన విషయాన్ని గమనించవచ్చు. ఫోటోలో ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే.. ఇందులో పెద్ద విశేషం ఏముంది? అందరి లాగే ఆయన కూడా కొత్త ఇల్లు కట్టుకొని కుటుంబంతో కలిసి పండుగ చేసుకున్నాడుగా అనుకోవచ్చు. అయితే.. అక్కడే ఉంది అసలు విషయం.ఆ ఫోటోలో భర్త, ఇద్దరు కుమార్తెలతో కనిపిస్తున్న మహిళ ఇప్పుడు ప్రాణాలతో లేరు. అది ఆమె మైనపు బొమ్మ. కొన్నేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన భార్యకు ఆ ఇంటి యజమాని అలా ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆవిధంగా తన ప్రేమను ఘనంగా చాటుకున్నారు. బంధువులతో పాటు గృహ ప్రవేశం కార్యక్రమానికి వచ్చిన వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.సాధారణంగా అమితమైన ప్రేమ గురించి చెప్పేటప్పుడు గుండెల్లో గుడి కట్టుకున్నాడు అంటారు. కానీ, ఈ పెద్ద మనిషి.. గుండెల్లో గుడి కట్టుకోవడం కాదు, జీవకళ ఉట్టి పడుతున్న తన అర్ధాంగి మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నాడు. గృహ ప్రవేశం నాడు ఆమెకు సముచిత గౌరవం కల్పించాడు. ఆయనే కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా.రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయించాడు. నేటి ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణిని చేయించాడు’. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలను చూసిన తర్వాత చాలా మంది చేస్తున్న వ్యాఖ్యలివి. భార్యలకు బతికుండగానే నరకం చూపిస్తున్న వ్యక్తులున్న ఈ సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉండటం గొప్ప విషయమే కదా. అందుకే శ్రీనివాస్ గుప్తాను ఎంత పొగిడినా తప్పులేదు.అంతేకాదు, ఆ విగ్రహాన్ని రూపొందించిన కళాకారులు కూడా మిక్కిలి అభినందనీయులే..! ఎందుకంటే.. అది విగ్రహమని చెబితే గానీ తెలిసేలా లేదు. జీవకళ ఉట్టి పడుతోంది. ఆమె మోముపై నవ్వుతో పాటు ఆమె చీర, నగలను అంత సహజసిద్ధంగా తీర్చిదిద్దారు. ఆమె నిజంగానే బతికి ఉన్నట్టుగా, తన వాళ్లతో కలిసి అక్కడ కూర్చునట్లుగా తీర్చిదిద్దారు. అది శ్రీనివాస్ గుప్తా కుటుంబానికే కాదు, చూపరులకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

Related Posts