YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పారిశ్రామిక వేత్తలు బెదిరిపోతున్నారు

పారిశ్రామిక వేత్తలు బెదిరిపోతున్నారు

విజయవాడ ఆగస్టు 11, 
బడుగు, బలహీన వర్గాల నడ్డి విరచడమేనా ఇండస్ట్రియల్ పాలసీ అంటే ?  వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ పారిశ్రామిక వేత్తలను సంతృప్తి పరిచేలా లేదు.  ఇండస్ట్రియల్ పాలసీ వల్ల ఉద్యోగాలు రావాలి, తలసరి ఆదాయాం పెరగాలి.  టీడీపీ హయాంలో అమలు చేసిన ఇండస్ట్రియల్ పాలసీని ఈ ప్రభుత్వం ఓసారి చూడాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు.  ఐదేళ్ల టీడీపీ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అనేకసార్లు నెంబర్ వన్ గా నిలిచింది. చంద్రబాబు హయాంలో 13 జిల్లాల్లోనూ తలసరి ఆదాయం పెరిగింది. టీడీపీ తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ పారిశ్రామిక ఎదుగుదలకు తోడ్పడింది.  మేము తెచ్చిన పాలసీ వల్ల 5 లక్షల 70 వేల ఉద్యోగాలు వచ్చాయి.  పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి లభించింది.  ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో మొబైల్, ఐటీ , ఫార్మా రంగాల్లో అనేక పరిశ్రమలు వచ్చాయి.  టీడీపీ హయాంలో సాధించిన ఘనతను వైసీపీ తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీలో చెప్పారు.  2018-19 పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల్లో రూ. 98, 993 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని బుక్ లో రాశారు.  2019-20లో పారిశ్రామికంగా ఏం సాధించారో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదని ఆమె అన్నారు.
 పారిశ్రామికాభివృద్ధికి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని దాన్ని బట్టే తెలుస్తోంది.  ఎస్సీ, బీసీ, మైనారిటీ, బడుగు, బలహీన వర్గాలను దెబ్బతీసేలా వైసీపీ ఇండస్ట్రియల్ పాలసీ వుంది.  టీడీపీ హయాంలో 75 లక్షల సబ్సిడీలు ఇస్తే దాన్ని వైసీపీ 50 లక్షలకు కుదించేసింది.  టీడీపీ హయాంలో తెచ్చిన పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ చట్టం వల్ల 74 సేవలు పారిశ్రామిక వేత్తలకు అందాయి.  టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలకు ఆకర్షితులై అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయి.  వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలి కారణంగా 2 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కు పోయాయి. ఈ ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో రాజకీయ జోక్యం ఎక్కువైంది.  పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు బెదిరిపోతున్నారు. కియా మోటార్స్ ను స్థానిక వైసీపీ ఎంపీ ఎలా బెదిరించారో అందరూ చూశారు. సంపద సృష్టించే పాలసీ ఒక్కటైనా వైసీపీ చేసిందా?
సంపద వచ్చే అమరావతి, విశాఖ, తిరుపతిని నిర్వీర్యం చేశారు.  అనుకూల వాతావరణం లేకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి?   టీడీపీ హయాంలో అమరావతిలో నిర్మించిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను నిరూపయోగం చేశారు.  చంద్రబాబు నాయుడు కష్టమంతా తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.  బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటామని వైసీపీ మేనిఫెస్టోలో చెప్పలేదా?  పారిశ్రామికంగా బడుగు, బలహీన వర్గాలు అభివృద్ది చెందకూడదా?  చంద్రబాబు హయాంలో ఇచ్చిన నిరుద్యోగి భృతిని ఆపేయడం అన్యాయమని ఆమె విమర్శించారు.  రాజుగారివి వంద కాళ్లు- నాది ఒక ఎద్దు అనే సామెతగా వైసీపీ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని ఆమె అన్నారు.

Related Posts