రాయ్పూర్ ఆగస్టు 12,
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని అడవులు మరోసారి నెత్తురోడాయి. సుక్మా జిల్లాలోని జగర్గుండా ఏరియాలో అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కనిపించారు. దాంతో వారి మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ ఎదరుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ పి సుందర్ రాజ్ స్పష్టం చేశారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.