YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఛత్తీస్ ఘడ్ లో నలుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్ ఘడ్ లో నలుగురు మావోయిస్టులు హతం

రాయ్పూర్ ఆగస్టు 12, 
ఛత్తీస్ ఘడ్  రాష్ట్రంలోని అడవులు మరోసారి నెత్తురోడాయి. సుక్మా జిల్లాలోని జగర్గుండా ఏరియాలో అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కనిపించారు. దాంతో వారి మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ ఎదరుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ పి సుందర్ రాజ్ స్పష్టం చేశారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.

Related Posts