YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కూతుళ్లపై కామవాంచ

కూతుళ్లపై కామవాంచ

హైద్రాబాద్ ఆగస్టు 12 
కన్నతండ్రి మెడకు ఉరి బిగించి కూతుళ్లు దారుణంగా హత్య చేసిన కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతుళ్లని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామవాంఛలతో రగిలిపోయి.. కడుపున పుట్టిన కూతుళ్లనే చెరబట్టేందుకు ప్రయత్నించాడు. కామకోరికలు తీర్చాలంటూ నిత్యం వేధింపులకు గురిచేయడంతో భరించలేక పోయిన బాలికలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలోని సీసాల బస్తీకి చెందిన వ్యక్తి(45) రోజుకూలీగా పనిచేస్తున్నాడు. ఏడాది కిందట భార్య అనారోగ్యంతో మరణించడంతో ఇద్దరు కూతుళ్లు(16), (17)తో కలసి ఉంటున్నాడు. మద్యానికి బానిసైన తండ్రి కామంతో రగిలిపోయి కడుపున పుట్టిన కూతుళ్లపై కన్నేశాడు. నిత్యం తాగొచ్చి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కీచకుడిగా మారి వేధింపులకు గురిచేస్తున్నా మౌనంగా భరించారు.కోరిక తీర్చాలంటూ తండ్రి ఆగడాలు శ్రుతిమించడంతో భరించలేక దారుణానికి తెగబడ్డారు. తండ్రి మెడకు తాడుబిగించి గొంతునులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. తండ్రిని కూతుళ్లు హత్య చేసిన విషయం బయటికి తెలియడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అణకువగా ఉండే కూతుళ్లు తండ్రిని హత్య చేశారంటే నమ్మలేకపోతున్నామని.. తండ్రి బరితెగించడంతో ఆత్మరక్షణ కోసం హత్య చేసి ఉంటారని స్థానికులు చెబుతున్నారు

Related Posts