హైదరాబాద్ ఆగష్టు 14
టీజేఎస్ కార్యాలయంలో విపక్షాలు ప్రెస్ మీట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బతికుండగా.. సహచర మంత్రులతో కేటీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారని ఎల్.రమణ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయనేది ప్రజలకు చెప్పాలన్నారు. కరోనా బాధితులకు న్యాయం జరిగే వరకు అఖిలపక్షం పోరాడుతుందన్నారు. కరోనాపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆగస్ట్ 17నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ప్రకటించారు.