సిద్దిపేట ఆగస్టు 15,
బస్వాపూర్ బ్రిడ్జి పై నుంచి పెద్దవాగు 2 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తోంది. శనివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో అటుగా వెళ్తున్న లారీ అందులోపడి కొట్టుకుపోయింది. డ్రైవర్ చెట్టును పట్టుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సమాచారం తెలిసిన మంత్రి హరీష్ రావు వెంటనే డ్రైవర్ ని కాపాడేందుకు అన్ని చర్యలు చెప్పట్టాలని ఆదేశించారు. - సంఘటన పై వెంటనే చర్యలు చెప్పట్టాలని జిల్లా కలెక్టర్, పొలీస్ కమిషనర్ , ఆర్డీవో లను అయన ఆదేశించారు. హైదరాబాద్, వరంగల్ నుండి ప్రత్యేక రెస్క్యూ టీం ను రప్పించి లారీ డ్రైవర్ ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.