న్యూఢిల్లీ ఆగస్టు 15,
పంద్రాగస్టు వేడుకలు న్యూఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. ఎర్రకోట వద్ద భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఓవైపు కట్టుదిట్టమైన భద్రత... మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 4 వేల మంది అథితులు హాజరయ్యారు. భారీ స్థాయిలో భద్రతా సిబ్బంది కూడా మోహరించారు.