YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన పవన్ కళ్యాణ్

జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన  పవన్ కళ్యాణ్

హైదరాబాద్ ఆగస్టు 15, 
74వ స్వాతంత్ర దినోత్సవ  వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో  నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ పతాకానికి వందనం చేసిన అనంతరం భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు సుమాంజలి అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇంచార్జ్  శంకర్ గౌడ్,  పార్టీ ముఖ్య నేతలు  షేక్ రియాజ్,  వై.నగేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts