YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రౌడీ షీటర్ మునికృష్ణ దారుణ హత్య

రౌడీ షీటర్ మునికృష్ణ దారుణ హత్య

కుప్పం ఆగస్టు 17,
చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాల్యం గ్రామంలో రౌడీ షీటర్ హత్య కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రౌడీ షీటర్ మునికృష్ణను  కత్తులతో గొంతుకోసి దారుణంగా హతమార్చారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మునికృష్ణ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. హతుడిపై అనేక కేసులు వున్నాయి. దాంతో అతనిపై రౌడీషీట్ కూడా నమోదయింది. దారికాచి ప్రజలను  బెదిరించి డబ్బు నగలు దోచుకొవడం, ఎకాంతంగా ఉన్న ఇళ్ళను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.పైపాళ్యం గ్రామంలో తరచూ గొడవలు పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. గత కొంతకాలంగా మృతుడి చిన్నాన్న కుటుంబానికి పొలం తగధాలు నడుస్తున్నదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈక్రమంలో హత్య జరిగిందా లేక వేరే ఎవరైనా హత్య చేశారా అనే విషయం విచారణలో తెలియాల్సింది.హత్య జరిగిన తరువాత రౌడి షీటర్ చిన్నాన్న కుటుంబం మొత్తం కనిపించకుండా పోయింది.

Related Posts