ఖమ్మం, ఆగస్టు 17,
భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి పువ్వాడ నియోజకవర్గాల వారీగా సమాచారం తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు సహాయ చర్యలపై ఇరు జిల్లాల కలెక్టర్ లతో వాకబు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రెండు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సమాచారం తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. రాబోయే మూడు రోజుల పాటు కూడా భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇరు జిల్లాల కలెక్టర్ లతో ఫోన్ లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితులను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. తక్షణ సహాయం అందించేందుకు ఇప్పటికే అన్ని బలగాలను సిద్ధం చేశారు. ప్రజారవాణా, సరుకు రవాణాకు, ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.