YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి సమీక్ష

ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి సమీక్ష

హైదరాబాద్ ఆగస్టు 17,(న్యూస్ పల్స్)
ఆర్ అండ్ బి ఉన్నతాధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష జరిపారు. సమీక్షా సమావేశంలో  ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ,ఈఎన్సీలు గణపతి రెడ్డి,రవీందర్ రావు పాల్గోన్నారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్యామేజ్ అయిన రోడ్లు,వంతెనల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రి  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా డ్యామేజ్ అయిన రోడ్లకు పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలి. వర్షానికి దెబ్బతిన్న రోడ్లు-వంతెనల వివరాలు అంచనావేసి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. పర్మినెంట్ గా వాటిని పునరుద్ధరణ చేయడం కోసం ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు సిద్ధం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు ఎదురవ్వకూడదు. అధికారులు 24 గంటలు తమ హెడ్ క్వార్టర్ లో కచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయాలి

Related Posts