YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నిత్యానంద కరెన్సీ..

నిత్యానంద కరెన్సీ..

న్యూఢిల్లీ, ఆగస్టు 17 
తరుచూ వివాదాలతో సావాసం చేసే వివాదాస్పద మత గురువు నిత్యానంద సొంత బ్యాంక్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వినాయక చవితి రోజున ఆగస్టు 22న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ కైలాష్ను ప్రారంభించబోతున్నట్లు నిత్యానంద వెల్లడించారు. అదే రోజు నుంచి ఆర్బీకే కరెన్సీ చలామణిలోకి వస్తుందని వివరించారు. ఇందుకు సంబంధించి పలు దేశాల బ్యాంకులతో చట్టబద్దంగా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు అతడు స్పష్టం చేశారు.ఏ దేశ కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, అలాగే కైలాస దేశం కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. కరెన్సీ రూపు రేఖలు, విధి విధానాలు 22న ప్రకటిస్తామని నిత్యానంద తెలిపారు. నిత్యానంద కరెన్సీగా ఇప్పటికే కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ అవుతున్నాయి.పిల్లల అక్రమ నిర్బంధం, మహిళల అదృశ్యం, అపహరణ కేసుల్లో గతేడాది తప్పించుకుని, దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ఈ క్వెడార్‌లోని భాగమైన ఓ ద్వీపాన్ని కొని, అక్కడ హిందూదేశం నిర్మించుకొన్నట్టు తొలుత వార్తలొచ్చాయి. అధికార మతంగా సనాతన హైందవాన్ని ప్రకటించుకొన్న ఈ దేశంలో పాస్‌పోర్టు నుంచి పౌరసత్వం దాకా ప్రతీది ప్రత్యేకమేనని కథనాలు వెలువడ్డాయి.అయితే, ఈ కథనాలన్నీ నిత్యానంద సొంత వెబ్‌సైట్‌ 'కైలాస.ఆర్గ్‌' వండివార్చిన సమాచారమేనంటూ ఈక్వెడార్‌ పేర్కొంది. అత్యాచారం, లైంగిక దాడి ఆరోపణలతో కొంత కాలం కర్ణాటకలోని రామనగర జైల్లో ఉన్న నిత్యానంద.. అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. బెంగళూరు శివార్లలోని బిడిదిలో నిత్యానంద ప్రధాన ఆశ్రమం ఉండగా.. గుజరాత్‌లో ఆయనపై కేసు నమోదయ్యింది. అక్కడ ఆశ్రమంలోని తమ పిల్లలను అక్రమంగా నిర్బంధించినట్టు కొందరు ఫిర్యాదు చేయడంతో నిత్యానంద భాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నాడు

Related Posts