న్యూఢిల్లీ ఆగష్టు 17
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గిరీష్ చంద్ర ముర్ము సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్కు తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న ఆయన ఈ నెల 8న ఆ పదవికి రాజీనామా చేసి కాగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రపతి భవన్ను సందర్శించి రామ్నాథ్ కోవింద్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. గిరీష్ చంద్ర ముర్ము దేశానికి 14వ కాగ్గా నియమితులయ్యారు.