YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాష్ట్ర యువతకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

 రాష్ట్ర యువతకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

భోపాల్ ఆగష్టు 18 
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువతకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని మంగళవారం తెలిపారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర యువతను ఆదుకుని వారికి ఉద్యోగాలు కల్పించేందుకు  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. దీని కోసం అవసరమైన చట్టపరమైన చర్యలు చేపడతామని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.కాగా, ఆంధ్రప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలను ఆ రాష్ట్రానికి చెందిన స్థానికులకే ఇచ్చేందుకు బిల్లులను కూడా ప్రవేశపెట్టాయి. ప్రైవేట్ ఉద్యోగాలను కూడా రాష్ట్రంలోని వారికే కేటాయించాలని కొన్ని రాష్ట్రాలు పేర్కొన్నాయి.

Related Posts