గువహటీ ఆగష్టు18
అసోం రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. 30 జిల్లాల్లో 56 లక్షల మందిపై వరదల ప్రభావం తీవ్రంగా ఉన్నది.ఇప్పటి వరకూ 112 మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 56,91,694 మందిపై వరదల ప్రభావం అధికంగా ఉందని రాష్ట్ర విపత్త నిర్వహణ సంస్థ వెల్లడించింది.దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కజిరంగా నేషనల్ పార్క్ లో భారీగా వరద నీరు రావడంతో వందలాది వన్యప్రాణులు చనిపోయాయి.