YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

దేశంలో 27లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 27లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ ఆగష్టు 18 
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు 60వేలకుపైగా నమోదైన కేసులు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 55,079 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 27లక్షల మార్కును దాటింది. మొత్తం పాజిటివ్‌ కేసులు 27,02,743కు చేరగా, 6,73,166 యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ నుంచి 19,77,780 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ప్రభావంతో తాజాగా 876 మంది మరణించగా, మృతుల సంఖ్య 51,797 చేరాయని మరణాలు సంభవించాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో సోమవారం 8,99,864 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటి వరకు 3,09,41,264 మందికి కరోనా పరీక్షలు చేసిందని ఐసీఎంఆర్‌ వివరించింది.

Related Posts