ముంబాయి ఆగష్టు 18
కంట్రవర్షియల్ టాపిక్స్తో ఎల్లప్పుడు వార్తలలో నిలుస్తూ వస్తున్న కంగనా రనౌత్ తాజాగా బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ విషయంలో సంచలన కామెంట్స్ చేసింది. తన ట్విట్టర్లో కరణ్ జోహార్కి ఇచ్చిన పద్మశ్రీ అవార్డ్ ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కార్గిల్ గర్ల్గా పేరు సంపాదించుకున్న గుంజన్ సక్సెనా బయోపిక్ విషయంలో గుంజన్ సక్సెనా సహోద్యోగి శ్రీవిద్య రాజన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో గుంజన్తో కలిసి ఐఏఎఫ్లో హెలికాప్టర్ పైలట్గా పని చేశా. 1996లో తనకు, గుంజన్కు ఇద్దరికి ఉధంపూర్లో పొస్టింగ్ ఇచ్చారని.. కానీ సినిమాలో మాత్రం గుంజన్ను మాత్రమే ఉధంపూర్ పంపించినట్లు తప్పుగా చూపించారని తెలిపారు శ్రీ విద్య. అంతేకాక సినిమాలో చూపించినట్లు చిన్న చిన్న సిల్లీ రీజన్ల వల్ల తమ బాధ్యతలు ఎప్పుడు పోస్ట్పోన్ కాలేదన్నారు.కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొదటి మహిళా పైలెట్ నేనే అని చెప్పుకొచ్చిన శ్రీ విద్య .. కార్గిల్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ముందుగా నేను ఉధంపూర్ వెళ్ళాను. తరువాత గుంజన్ తన టీంతో కలిసి శ్రీనగర్ వెళ్లింది. అప్పుడు తాము అన్ని విభాగాల్లో విధులు నిర్వహించామని తెలిపారు శ్రీ విద్య. సినిమాలో అన్ని తప్పులు చూపించారంటూ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేయగా దానిపై కంగనా తీవ్రంగా స్పందించింది. కరణ్ జోహార్ యొక్క పద్మశ్రీని తిరిగి తీసుకోమని భారత ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తున్నాను. అతను నన్ను బహిరంగంగా బెదిరించాడు. అంతర్జాతీయ వేదికపై పరిశ్రమ నుండి వెళ్లిపొమ్మని బెదిరించాడు. సుశాంత్ కెరీర్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నాడు. ఉరి యుద్ధంలో పాకిస్థాన్కు మద్దతు ఇచ్చాడు . ఇప్పుడు మన సైన్యానికి వ్యతిరేకంగా యాంటినేషనల్ చిత్రం తీసాడు అంటు సంచలన కామెంట్స్ చేసింది.