YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనాతో షార్ మూసివేత

కరోనాతో షార్ మూసివేత

నెల్లూరు, ఆగస్టు 19, 
ఒక్క వైరస్ ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇవాళ్టి నుంచి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్‌లో పూర్తిగా లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఘన ఇంధన విభాగంలో పనిచేసే ఉద్యోగులు పలువురికి కరోనా పాజిటివ్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ ప్రభావంతో శ్రీహరికోటలో ఇస్రో కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది.సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ (ఎస్‌డీఎస్‌సీ-షార్)లో కార్యకలాపాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం ప్రతి రోజూ జరిగే అన్ని రకాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. షార్ కంట్రోలర్ వీ కుంభకర్ణన్ జారీ చేసిన ఓ సర్క్యులర్‌లో తెలిపిన వివరాల ప్రకారం, షార్‌లోనూ, సూళ్ళూరు పేట గృహ నిర్మాణ సముదాయాల్లోనూ కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. దీంతో ఈ వైరస్ సోకినవారిని, వారికి సమీపంలో సంచరించినవారిని గుర్తించవలసిన అవసరం ఏర్పడింది. కరోనా వైరస్ సోకిన వారితో కలిసి తిరిగిన వారిని గుర్తించి, ప్రత్యేకంగా చికిత్స అందజేయవలసి ఉంది. ఈ వ్యాధి మరింత విస్తరించకుండా ముందు జాగ్రత్త కోసం కార్యాలయ ప్రాంగణాల్లో ఫ్యుమిగేషన్, శానిటైజేషన్ చేయించవలసి ఉంది.  ఈ చర్యల కోసం షార్ కార్యకలాపాలన్నిటినీ తాత్కాలికంగా నిలిపేయాలని నిర్ణయించామన్నారు. రాకెట్ లాంచ్ స్టేషన్‌లో ముఖ్యమైన కార్యకలాపాలను నిర్వహించేందుకు అతి తక్కువ మంది సిబ్బంది మాత్రమే పని చేస్తారని ఈ సర్క్యులర్ పేర్కొంది. అత్యవసర సేవల విభాగం మినహా మిగిలిన ఉద్యోగులంతా ఇళ్ల వద్ద నుంచే పని చేయాలని పేర్కొంది. పులికాట్ నగర్ ఎంప్లాయీస్ కాలనీలో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అష్ట దిగ్బంధనం విధించారు. ఉద్యోగులు స్వీయనిర్బంధంతో కరోనా వ్యాప్తి నిరోధానికి సహకరించాలని అధికారులు కోరారు.

Related Posts