YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

మాలీలో తిరుగుబాటు

మాలీలో తిరుగుబాటు

న్యూఢిల్లీ, ఆగస్టు 19  
పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. అధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్‌ కైత నివాసాన్ని చుట్టుముట్టిన సైన్యం.. ఆయనను, ప్రధాని బూబూ సిస్సేను బంధించారు. అధ్యక్ష పదవికి ఇబ్రహీం రాజీనామా చేయాలని మాలిలో కొన్ని నెలలుగా ప్రజాందోళనలు జరుగుతున్నాయి. మాలి రాజధాని బమాకోకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక పట్టణం కతిలో సోమవారం అశాంతి రగులుకుంది. అక్కడి ఆయుధాగారం నుంచి ఆయుధాలను తీసుకున్న సైనికులు తొలుత తమ అధికారులను నిర్బంధించారు. ఆ తర్వాత అధ్యక్షుడి నివాస భవనం వద్దకు వెళ్లి దాన్ని చుట్టుముట్టారు.తాజాగా, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఇబ్రహీం బూబకర్ బుధవారం ప్రకటించారు. దేశాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టివేసిన సైనిక తిరుగుబాటు తరువాత రక్తం చిందించాలని తాను కోరుకోవడంలేదని పేర్కొన్నారు. ‘నేడు, సైన్యంలోని కొన్ని భాగాలు జోక్యం అవసరమని నిర్ణయించాయి. నాకు నిజంగా ఎంపిక ఉందా? ఎందుకంటే రక్తం చిందించాలని నేను కోరుకోను’ అని జాతీయ టెలివిజన్‌‌కు ఓ సంక్షిప్త ప్రకటన ఇచ్చారు. ఇప్పటి నుంచి నా విధిని వదులుకుంటున్నానని అన్నారు.అయితే, దేశంలో పాలన సైన్యం చేపట్టినట్టు స్పష్టతలేదు. మాలీలో సైనిక తిరుగుబాటును ఒకప్పుడు ఆ దేశం అధిపత్యం చెలాయించిన ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా యూనియన్‌లు తీవ్రంగా ఖండించాయి. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించాయి. మాలిలో సైద్ధాంతికంగా సాయుధ దళాలు అధికారం కోసం ప్రేరేపించడంతో దేశంలో ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇది పొరుగు దేశాలైన నైజర్, బుర్కినా ఫాసోకి పాకడంతో ఆ ప్రాంతంలో అస్థిరత, భారీ మానవ సంక్షోభాన్ని సృష్టించాయి.

Related Posts