YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ట్రెజరీ ఉద్యోగి దాచిన ఆభరణాలు, నగదు, అయుధదాల పట్టివేత

ట్రెజరీ ఉద్యోగి దాచిన ఆభరణాలు, నగదు, అయుధదాల పట్టివేత

అనంతపురం ఆగస్టు 19 
ట్రెజరీ ఉద్యోగి గాజుల మనోజ్ కుమార్ దాచుకున్న బంగారం, వెండి ఆభరణాలు, నగదు  భారీగా పట్టివేసారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గాంధీనగర్ లో ఉంటున్న బాలప్ప  ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టెల్లో దాచినట్లు పోలీసులు గుర్తించారు. మనోజ్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ 8 వ క్రాస్ లో నివాసముంటున్నాడు. ఇతని తండ్రి జి.సూర్యప్రకాష్ పోలీసుశాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ చనిపోవడంతో కారుణ్య నియామకం కింద 2005లో మనోజ్ కుమార్ కు జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం వచ్చింది.  ముందుగా  మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బుక్కరాయసముద్రంకు చెందిన నాగలింగం మనోజ్   డ్రైవర్. భారీగా పట్టుబడిన సొమ్మును దాచిన ఇంటి యజమాని బాలప్ప స్వయాన నాగలింగంకు మామ అవుతాడు.  బాలప్ప  మూడు 9 ఎం.ఎం ఫిస్టోల్స్ , 18 బ్లాంక్స్ రౌండ్లు, ఒక ఎయిర్ గన్, 2.42 కె.జి ల బంగారు ఆభరణాలు, 84.10 కె.జి వెండి ఆభరణాలు, రూ. 15,55,560/ ల నగదు, రూ. 49.10 లక్షల ఫిక్స్ద్ డిపాజిట్ / ఎన్ ఎస్ ఎస్ బాండ్లు, రూ. 27.05 లక్షల ఫ్రామిసరీ నోట్లు, రెండు మహీంద్ర కార్లు, 3 ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లు, హార్లీ & డేవిడ్ సన్ మోటారు సైకిల్ , మరో రెండు కరిశ్మా ద్విచక్ర వాహనాలు, హోండా యాక్టివా, 4 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు.  భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు, తదితరాలు కల్గిఉండటంపై కేసు నమోదు చేసారు. ఈ దాడుల్లో సి.సి.ఎస్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ  జి.వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, బుక్కరాయసముద్రం సి.ఐ సాయి ప్రసాద్ , సి.సి.ఎస్ సి.ఐ శ్యాంరావు, బుక్కరాయసముద్రం ఎస్సై ప్రసాద్ సిబ్బంది పాల్గోన్నారు.  

Related Posts