YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సెప్టెంబర్ 7 నుంచి ఏడు రోజులే.. అసెంబ్లీ

సెప్టెంబర్ 7 నుంచి ఏడు రోజులే.. అసెంబ్లీ

హైద్రాబాద్, ఆగస్టు 20, 
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సెషన్స్ జరగాల్సిన రోజులను బాగా కుదించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం వారం రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నారట. దీనికి కారణం కరోనా. శాసనసభ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 7 నుంచి నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. కనీసం 15 నుంచి 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని సీఎం చెప్పినప్పటికి కరోనా పరిస్థితుల నేపథ్యంలో 7 నుంచి 10 పనిదినాలు మాత్రమే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించడంతోపాటు నిర్ణయాలు తీసుకునేందుకు కనీసం 15 నుంచి 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికి కరోనా పరిస్థితుల నేపథ్యంలో 7 నుంచి 10 పనిదినాలు మాత్రమే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. శాసనమండలిని 5 రోజులపాటు జరపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ సమావేశాలను 2020 మార్చి 6 నుంచి 20 వరకు నిర్వహించాలనుకున్నా కరోనా వల్ల మార్చి 16నే ముగించారు.కరోనా నిబంధనలకు అనుగుణంగా శాసనసభలో సభ్యులు భౌతికదూరం పాటించేలా సీట్ల ఏర్పాటుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులు అసెంబ్లీ సమావేశ మందిరం తోపాటు విజిటర్స్, ప్రెస్‌ గ్యాలరీని సందర్శించారు. ఒకట్రెండు రోజుల్లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలసి ఏర్పాట్లపై చర్చించే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత వచ్చాక సమావేశాలు నిర్వహించాల్సిన తీరుపై సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది.ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సంతాపం తెలిపే తీర్మానంతోపాటు పలు బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనున్నారు. ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ, ఎఫ్‌ఆర్‌బీఎం, టీచింగ్‌ హాస్పిటల్స్‌లో పనిచేసే అధ్యాపకుల రిటైర్మెంట్‌ వయసు 65 ఏళ్లకు పెంపు వంటి ఆర్డినెన్స్‌లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే సాగునీటి విభాగం పునర్వ్యవస్థీకరణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ, నియంత్రిత సాగు, నూతన సచివాలయ భవన నిర్మాణం వంటి అంశాలపైనా అసెంబ్లీ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Related Posts