YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముంపు గ్రామాల్లో టీడీపీ పర్యటన

ముంపు గ్రామాల్లో టీడీపీ పర్యటన

రాజమండ్రి ఆగస్టు 20, 
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం వరద ముంపు ప్రాంతాలైన పల్లిగూడేం, పుగాకులంక, జంబవని పేట, మురమళ్ళలో టీడీపీ బృందం పర్యటించింది. టీడీపీ నేతలు చినరాజప్ప, బుచ్చిబాబు, వనమాడి కొండబాబు, జ్యోతుల నవీన్ తదితరులు వరద బాధితులను పరామర్శించారు.గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో యలమంచిలి మండలంలోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, యలమంచిలి లంక, బాడవ గ్రామాలు పూర్తిగా జలదిగ్భంధం అయ్యాయి. ఈ గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగించే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో దాదాపు 1,733 ఇళ్లు వరద నీటిలో ఉన్నాయని తహసీల్దార్ ఎల్.నరసింహారావు తెలిపారు.

Related Posts