YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

13 ఎర్ర చందనం దుంగలు, టాటా వ్యాన్, మోటార్ సైకిల్ స్వాధీనం ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్

 13 ఎర్ర చందనం దుంగలు, టాటా వ్యాన్, మోటార్ సైకిల్ స్వాధీనం  ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్

రేణిగుంట ఆగష్టు 20 
డంప్ చేసి ఉంచిన 13 ఎర్ర చందనం దుంగలను రవాణా చేస్తుండగా, టాటా వ్యాన్, మోటార్ సైకిల్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఐదుగురు స్మగ్లర్లు ను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ రైల్వే కోడూరు టీమ్ ఆర్ ఐ కృపానంద నేతృత్వంలో భాకరాపేట మీదుగా కూంబింగ్ చేస్తుండగా  చిన్న గొట్టి గల్లు అటవీ ప్రాంతంలో వీరు తారసపడినట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం తో ఆర్ ఐ కృపానంద తన టీమ్ తో కూంబింగ్ చేపట్టినట్లు తెలిపారు. గురువారం తెల్లవారుజామున  చిన్నగొట్టి గల్లు మండలం దేవరకొండ సమీపంలో ని కొత్తపల్లి నాగూరు తోట వద్ద  దుంగలను రవాణా చేయడానికి ప్రయత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ టీమ్ దాడి చేశారు. వీరి నుంచి 13 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని దేవరకొండ కు చెందిన నక్కా అమరనాథ రెడ్డి (39), దూది సురేష్ (34), సింగంశెట్టి విశ్వనాథ్ (40), కొలంకల నాగభూషణం (47), గొల్లపల్లి కి చెందిన బండారం కుమార్ (32) లు గా గుర్తించినట్లు తెలిపారు. వీరు లాక్ డౌన్ సమయంలో దుంగలను సేకరించి, డంప్ చేసిపెట్టారని అన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసిన సిఐ సుబ్రహ్మణ్యం దర్యాప్తు చేస్తున్నారు. ఈ బృందం లో ఏఆర్ ఎస్ ఐ ప్రసాద్, పీసీలు గోపి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Related Posts