న్యూఢిల్లీ, ఆగస్టు 20
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ సందర్భంగా.. అతడ్ని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా లేఖ రాశారు. గత శనివారం తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ధోనీ.. అందరికీ ఊహించిన షాకిచ్చాడు. కెప్టెన్గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్కి అందించిన ధోనీ.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో తొలిసారి టీమిండియాని నెం.1 స్థానంలో నిలిపాడు. దాంతో.. దేశంలోని క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు ధోనీ ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ‘థ్యాంక్స్ ధోనీ’ అంటూ ట్వీట్స్ చేశారు.ధోనీ రిటైర్మెంట్పై తాజాగా స్పందించిన ప్రధాని మోడీ.. ఓ రెండు పేజీల లేఖని ధోనీకి పంపారు. అందులో ధోనీ అంటే కేవలం గణాంకాలు, మ్యాచ్ రికార్డ్లుగా గుర్తించుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడిన మోడీ.. అతడ్ని కేవలం ఒక క్రీడాకారుడిగా చూడటం కూడా తగదన్నారు. ఒక క్రికెటర్గానే కాకుండా తండ్రిగా కూడా జీవాతో ధోనీకి ఉన్న అనుబంధాన్ని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోడీ లేఖపై మహేంద్రసింగ్ ధోనీ కూడా స్పందించాడు. ఆర్టిస్ట్, సైనికుడు, క్రీడాకారుడు కోరుకునేది ఇలాంటి ప్రశంసలేనని చెప్పుకొచ్చిన ధోనీ.. మోడీకి థ్యాంక్స్ చెప్పాడు. సాధారణంగా ధోనీ తనకి వచ్చే ప్రశంసలు, శుభాకాంక్షలపై స్పందించడు.