YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఈ చిత్రం వ‌సూళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ దృష్టి

ఈ చిత్రం వ‌సూళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ దృష్టి

న‌ట‌సింహ‌ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘జై సింహా’.. విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌సూళ్ళ ప‌రంగానూ ఈ సినిమా మెప్పిస్తోంది. దీంతో.. ఈ చిత్రం వ‌సూళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా.. తొలుత‌ చిత్ర నిర్మాత సి.కల్యాణ్ ఆఫీస్‌పై ) సోదాలు చేపట్టింది ఐటీ శాఖ‌. కృష్ణానగర్‌లో ఉన్న‌ ఆయన కార్యాలయంలో.. ఆరుగురితో కూడిన ఐటీ ఆఫీస‌ర్ల‌ బృందం సోదాలు కొనసాగిస్తోంది. మొద‌టి వారంలోనే ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో.. నిర్మాత ఆదాయపు పన్ను సక్రమంగా కట్టారా? లేదా? అన్న విష‌యంపై ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆఫీస్‌లో త‌నిఖీలు పూర్త‌య్యాక‌.. చిత్ర నిర్మాత సి.క‌ల్యాణ్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ‘జై సింహా’ చిత్రం త‌రువాత సి.క‌ల్యాణ్ సంస్థ నుంచి రానున్న ఇంటెలిజెంట్ కూడా భారీ బడ్జెట్‌తో  తెర‌కెక్కుతున్న నేప‌థ్యంలో.. ఈ విష‌యంపైనా ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నార‌ని స‌మాచార‌మ్‌. 

Related Posts