హైదరాబాద్ ఆగస్టు 21,
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా? కుట్రా??..జగన్ జలదోపిడీకి కేసీఆర్ సహకరించి, విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందే చెప్పామని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఘటనపై అయన స్పందించారు. గురువారం రాత్రి జరిగిన పరిణామం అనేక అనుమానాలకు తావిస్తోంది..కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం ఉందేమోననిపిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని అయన డిమాండ్ చేసారు.